ఇల్లందకుంట, జనవరి 9: ‘రూ.25 లక్షలు ఇవ్వాలని.. లేకుం టే నీవు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఫైల్ తయారు చేసి సీఎంకు పంపిస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఓ అధికారిని బెదిరించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పాతర్లపల్లికి చెందిన అబ్బిడి సురేందర్రెడ్డి, జయశంకర్ జిల్లా గుండ్లకర్తికి చెందిన రియాజ్, కుమారస్వామి, సురేశ్ స్నేహితులు. వీరంతా ఇటీవల హైదరాబాద్లో పనిచేస్తున్న ఓ అధికారికి ఫోన్ చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు జరిపి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపారు.