హైదరాబాద్: పోరాటాలు బీఆర్ఎస్కు కొత్తేంకాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ (KTR) అన్నారు. బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
‘పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ షేర్ చేశారు.