హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెం ట్లు 95 శాతం మంది విధుల్లో చేరారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని డీఆర్డీవోలకు ఆదేశాలిచ్చారు. మొత్తం 7,018 మం ది ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరడానికి అర్హులుగా అధికారులు తేల్చారు.
మూడు రోజులుగా 6,630 మంది విధుల్లో చేరారు. మిగిలిన 388 మందిలో కొందరు చనిపోయారని, మరికొందరు గతంలోనే సస్పెన్షన్లో ఉన్నారని గుర్తించారు. ఇంకా కొందరు విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని అంచ నా వేస్తున్నారు. రెండేండ్ల క్రితం నాటికి ఇప్పటికి ఉపాధి హామీ సాఫ్ట్వేర్లో అనేక మార్పు లు వచ్చాయి. వీటిపై త్వరలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.