South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా జులై 24 నుంచి 30వ తేదీ మధ్యలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. కాగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు.
కాచిగూడ – నిజామాబాద్ (07596)
నిజామాబాద్ – కాచిగూడ (07593)
నాందేడ్ – నిజామాబాద్ (07854)
నిజామాబాద్ – నాందేడ్ (07853)
జులై 23 నుంచి 30వ తేదీ వరకు దౌంద్ నుంచి నిజామాబాద్ (11409) వెళ్లే రైలు ముద్ఖేడ్ – నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దయింది. జులై 24 నుంచి 31 వరకు నిజామాద్ నుంచి పంధర్పూర్(01413) వెళ్లే రైలు నిజామాబాద్ – ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు అయింది.
కర్నూల్ సిటీ – సికింద్రాబాద్ (17024) రైలు జులై 25న 90 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది. గుంతకల్ – బోధన్(07671) రైలు జులై 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది. ఈ విషయాలను రైలు ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.