హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా, వివరంగా తెలియపరుస్తున్నారు కేటీఆర్. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే తన తొలి యూనిట్ను ప్రారంభించిన ఫెర్రింగ్ ఫార్మా తన రెండో యూనిట్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దావోస్ వేదికగా ఈ నిర్ణయాన్నిస్విట్జర్లాండ్కు చెందిన ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది.
దాదాపు నెల క్రితమే హైదరాబాద్లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రెండో యూనిట్ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకోసం రానున్న రెండు మూడేండ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
I had the pleasure of inaugurating their first facility only last month & just after one month, the company has decided to invest additional ₹500 Cr based on their seamless experience
This only reinstates the confidence global companies are reposing in Hyderabad’s ecosystem.
— KTR (@KTRTRS) May 25, 2022