కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గూడెన్ఘాట్లో మహిళా కౌలురైతు సందవేణి సుమలత (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నది. సుమలతను మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన రాజ్కుమార్కి ఇచ్చి 12 ఏండ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం దంపతులిద్దరూ తమ పిల్లలతో కలిసి గూడెన్ఘాట్కు చేరుకొని వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
పదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశారు.ఇందుకు కోసం ప్రైవేట్వడ్డీ వ్యాపారుల దగ్గర రూ.3లక్షల అప్పు చేశారు. నష్టాలు రావడంతో, చేసిన అప్పులు తీర్చేదారిలేక దంపతులిద్దరూ బాధపడుతుండేవారు. ఈ క్రమం లో అప్పులు తీర్చలేక మనస్థాపంతో సుమలత ఈ నెల 12న ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.