ముషీరాబాద్, జూలై 3 : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యానగర్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన ప్ర దర్శన చేపట్టారు. విద్యానగర్, నల్లకుంట, శంకర్మఠ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా రూ.300 కోట్లు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ చొరవ తీసుకొని 18 ఏండ్లు గా కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలని కోరారు.