యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఆరేండ్ల కూతురుతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన చెరుకూరి సురేష్(40) గురువారం ఉదయం స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మయూరి లాడ్జిలో అద్దెకు దిగాడు. అర్ధరాత్రి సమయంలో తన కూతురు శ్రీస్త(6) ను భవనంపై నుంచి తోసేసి తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కడినే చనిపోతే కూతురును భార్య సరిగా చూసుకోలేదని, అందుకే కూతురుతో కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు లెటర్ లో రాసి ఉంది.