పటాన్చెరు: ఆరేళ్ల కుమారుడిని ఓ తండ్రి కర్కశంగా కొట్టి చంపాడు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఈ దారుణం జరిగింది. సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో నివసించే ఒక కుటుంబంలో అరుణ్ అనే ఆరేళ్ల పిల్లాడిని తండ్రి వినయ్ ఉదయం నుంచి హింసిస్తూనే ఉన్నాడు.
ఇది శ్రుతిమించడంతో ఆ పసివాడు కన్నుమూశాడు. బాలుడి మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.