హైదరాబాద్ : మంచిర్యాల(Mancheriala )జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫోన్ గొడవ(Cell phone) ఓ నిండు ప్రాణాన్ని బలి తీతీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రామకృష్ణాపూర్కు(Ramakrishnapur) చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు రాయమల్లుకు(62) రాకేష్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా, సెల్ఫోన్ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ నెలకొంది.
దీంతో ఆవేశానికి గురైన రాకేష్ తండ్రి రాయమల్లు తలపై రోకలిబండతో కొట్టి హతమార్చాడు(Father death). సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.