హైదరాబాద్: నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘనటపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.