జోగులాంబ గద్వాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటిక్యాల మండలం కోదండా పూర్ ధర్మవరం జాతీయ రహదారి 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన నలుగురు కారులో తిరుపతికి వెళ్తుండగా జాతీయరహదారిపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్నారు.
ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి, కూతురు శ్రీలత మృతి చెందగా తండ్రి ప్రకాశ్, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.