నాగర్కర్నూల్ : కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతులు ఆందోళన(Agitation) బాటపట్టారు. అప్పుజేసి ఆరుగాలం శ్రమించిన పంటలకు గిట్టుబాటులేక ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఆదివారం జిల్లాలోని అచ్చంపేట(Achampet)లో వేరుశనగ రైతులు(Groundnut farmers) గిట్టుబాటు ధర కోసం ఉద్యమించారు.
ఎంతో కష్టపడి పంటను మార్కెట్కు తరలిస్తే పట్టించుకునే నాథుడే లేడనే ఆగ్రహంతో వ్యవసాయ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మార్కెట్ చైర్ పర్సన్ పై దాడికి పాల్పడ్డారు. అంబేద్కర్ చౌరస్తాలో చైర్పర్సన్ను నిర్భందించి రాస్తారోకో చేపట్టారు. గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని నినదించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.