మరికల్, ఏప్రిల్ 29 : భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ, దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యామ్ను ఇసుక మాఫియా బుధవారం తెల్లవారుజామున హిటాచీతో ధ్వంసం చేయడానికి యత్నించింది. వాగు వద్ద శబ్దం రావడంతో గమనించిన రాకొండ బీఆర్ఎస్ సర్పంచ్ గాదం పుల్లప్ప నీటిపారుదల శాఖ అధికారులతోపాటు బస్వాపూర్ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు చెక్డ్యామ్ను ధ్వంసం చేయడానికి యత్నిస్తున్న వారిని అడ్డుకోవడంతో ఇసుక మాఫియాకు చెందిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా చెక్డ్యామ్ కొంతవరకు ధ్వంసం కావడంతో నీరు వృథాగా పోతున్నది. ఈ ఘటనపై గ్రామస్తులు, చెక్డ్యామ్ కాంట్రాక్టర్ వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు దేవరకద్ర పోలీసులు తెలిపారు.