తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు ఒకప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసేవారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పెట్టుబడి సాయం అందిస్తూ రైతులను ఆదుకుంటున్నారు. కేసీఆర్ పుణ్యాన రైతులు సంతోషంగా జీవిస్తున్నారు. రైతులకే కాకుండా.. వృద్ధులకు ఆసరా పెన్షన్లు, నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఏడేండ్లలోనే కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. రైతులందరూ కేసీఆర్కు రుణపడి ఉంటారు. కేసీఆర్ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తయి. – బైరెడ్డి సురేంద్రరెడ్డి ( చెల్లూరు గ్రామం, వీణవంక మండలం )
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాటి, ఈత చెట్లపై పన్ను తగ్గించారు. ప్రమాదవశాత్తు మరణించిన గౌడ కులస్తులకు తక్షణమే ఎక్స్గ్రేషియా అందిస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో గిరకతాళ్లను కూడా అందించారు. కేసీఆర్ ప్రభుత్వం తమకెంతో సహాయ, సహకారాలు అందిస్తుంది. మా గౌడన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. – గీత కార్మికుడు రాజయ్య గౌడ్ ( చెల్లూరు గ్రామం, వీణవంక మండలం )