నిజామాబాద్ : కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించడంలో రైతులు దళారులను దరిచేరనీయవద్దని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు. జిల్లాలోని వర్ని మండలం పాత వర్ని గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని సేకరిస్తుందన్నారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో వారంలో జమ చేస్తారన్నారు. స్పీకర్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.