హైదరాబాద్ : మిర్చి రైతులు(Chilli Farmers) కన్నెర్రజేశారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే వ్యాపారులు ధరలు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాటకంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్ ఎదుట ( Khammam, Mirchi market) ఆందోళన(Protested) చేపట్టారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. రైతుల ఆందోళనతో మార్కెట్లో కొనుగోళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.