సారంగాపూర్/ఎడపల్లి/ నవీపేట, ఫిబ్రవరి 27: యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో బాసర ప్రధాన రహదారిపై రాంపూర్, పొతంగల్, నవీపేట, ఫత్తేనగర్, అభంగపట్నం రైతులు రాస్తారోకో చేశారు.
ఎడపల్లి మండలం జానకంపేట్ గోదాము వద్ద నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో యూరియా బస్తాపై రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని అధికారులను రైతులు నిలదీశారు.