పటాన్ చెరు : రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ ధర్నా చేస్తున్నారు.
రైతుల మహాధర్నకు రాష్ట్ర మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావుతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్చెరు, జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని ధర్నా చేస్తున్న రైతులు చెప్పారు. రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో మహాధర్నాకు చేరుకున్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్, బాల్ రెడ్డి, సోమిరెడ్డి, ఐలాపూర్ మాణిక్ యాదవ్తోపాటు రైతులు పాల్గొన్నారు.