సూర్యాపేట : నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ పార్టీ పంటలకు నీళ్లడిగితే ఆ పార్టీ నాయకులను కోసి వారి రక్తంతో పంటలకు చల్లాలని అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం మాటలకు నిరసనగా సూర్యాపేట జిల్లా చివేముల మండలం సేవాలాల్ తండా లో గిరిజన రైతులు తమ రక్తాన్ని తీసి పొలంలో చల్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రక్తంతో కూడా పంటలు పండించొచ్చు.
ఈ పండిన పంటలను ఆయనకే పంపిస్తాం. ఆయన ఇంక నాలుగు రోజుల ఎక్కువ జీవిస్తాడు. రైతులందరూ రక్తాన్ని పొలాల్లో చల్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనపై కడుపు మండిన రైతులు తమ నెత్తరు చిందించి పాలకులకు బుద్ధి చెప్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.