G. Vivek | ధర్మపురి, మే 3: ‘ఓ సారూ.. మా సర్కారు తడి సిన వడ్లు కొంటాన్నది కదా? మల్ల నువ్వు గిక్కడి కెందుకచ్చినవ్? ఇందుల మల్ల బీజేపీ రాజకీయం జేసుడేంది?’ అంటూ రైతన్నలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తిరగబడ్డారు. జ గిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని బుధవా రం వివేక్ సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వివేక్ మాట్లా డు తుండగా.. అక్కడున్న రైతులు ఎదురుతిరిగారు.
రా ష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చే స్తామని చెప్పాక బీజేపీ రాజకీయం చేయడమేమి టని నిలదీశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యా న్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చినట్టు రైతులు వివేక్తో చెప్పారు. దీంతో వివేక్ పొంతనలేని మాటలు మాట్లాడుతుండగా, రైతులు తిరగబడటంతో అక్కడి నుంచి మారు మాట్లాడకుండా తోక ముడిచారు.