నల్లగొండ: రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్కు పరమావధి అని ఎమ్మెల్సీ గుత్తా సుంఖేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు బీజేపీయే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో ఎమ్మెల్యే భాస్కర్రావు, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారనే బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు.
రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్సీఐ గోదాముల్లోనే ఉందని, రైల్వే వ్యాగన్లు ఏర్పాటుచేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మిల్లర్లు పంపే బియ్యాన్ని ఎఫ్సీఐ త్వరగా దిగుమతి చేయట్లేదన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఈనెల 10న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి కోటిరెడ్డి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారని, కేంద్ర ప్రభుత్వమే స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.