జగిత్యాల : రైతుల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పని చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, పండించిన పంటలకు గిట్టుబాటుధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించింది .రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నార’ని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, ఎంపీపీ చిట్టి బాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యేరి రాజేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ సునిల్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శేఖర్, రైతు బంధు అధ్యక్షుడు సౌల్ల భీమన్న తదితరులు పాల్గొన్నారు.