Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో చేసిన అభివృద్ధిని, రైతు సంక్షేమ పథకాలను ఆయా గ్రామాల్లోని రైతు వేదికల కేంద్రంగా వివరించనున్నారు.
రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ విత్తన నాణ్యతపై ప్రత్యేక పాటను రూపొందించింది. వ్యవసాయంలో రైతుకు అధిక లాభాలు తేవడంలో నాణ్యమైన విత్తనాల పాత్ర ఏంటి? వంటి అంశాలను ఈ పాటలో పొందుపరిచారు. శనివారం వ్యవసాయ శాఖ ఉత్సవాల్లో భాగంగా ఈ పాటను ప్రదర్శించనున్నారు.