లింగాలఘనపురం/కందుకూరు, సెప్టెంబర్ 24: దిగుబడులు సరిగా రాక.. అప్పులు తీర్చేమార్గంలేక జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కిష్టగూడేనికి చెందిన మేకల మల్లేశం (45) 8 ఎకరాల్లో పత్తి , ఎకరంలో వరిని సాగు చేస్తున్నాడు. ఎవుసం కలిసి రాక అప్పులు కావడంతో మంగళవారం పురుగుల మందు తాగా డు.
కుటుంబ సభ్యులు హనుమకొండ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెం దాడు. అలాగే అప్పు ల బాధ భరించలేక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్కు చెందిన రైతు నందిగామ నర్సింహ (55) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి మూడు ఎకరాల పొలం ఉన్నది. పెట్టుబడికి డబ్బుల్లేక రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. అప్పులు అధికం కావడంతో ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించాడు.