కామారెడ్డి, జూన్ 22: యూరియా దొరుకడం లేదనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. యూరియా కోసం రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేటఆందోళనకు దిగారు. యాప్పై అవగాహన లేకపోవడం, రోజుల తరబడి క్యూలో నిలబడినా ఎరువులు అందక మనస్తాపం చెందిన రైతు కుమ్మరి వెంకటి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
సమీపంలో ఉన్న పోలీసులు, రైతులు అడ్డుకుని పెట్రోల్ డబ్బా లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది.