Grain Purchase | కేసముద్రం, మే 6: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆరు బయట ఉన్న ధాన్యం, మకజొన్న కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన ధాన్యం చేతికంది వస్తుండటంతో విక్రయానికి తీసుకొచ్చి మారెట్లోని షెడ్లలో, ఆరు బయట మకజొన్న, ధాన్యాన్ని రాశులుగా పోశారు.
వ్యాపారులు షెడ్డులో ఉన్న ఉత్పత్తులకే ఈ నామ్ టెండర్ వేసి, మిగిలిన వాటికి వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఏఎంసీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆరు బయట ఉన్న వాటిని ముందుగా కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు షెడ్లలో ఉన్న వాటిని కొనుగోలు చేయడమేంటని ప్రశ్నించారు. మారెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు స్పందిస్తూ, రేపు ఆరు బయట ఉన్న వాటికి టెండర్ వేయిస్తామని తెలుపడంతో రైతులు ఆందోళన విరమించారు.