జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని గణపురం మండలంలోని బుద్దారం, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలుకోరే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఘనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కొవిడ్ టెస్ట్ లు చేస్తున్న తీరు, అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ కాకుండా, వారికోసం కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో ఉంచాలన్నారు.
వారికి కావాల్సిన మెరుగైన చికిత్సను అందించాలని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ కి పంపించవద్దని అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
జర్నలిస్ట్ శ్రీధర్ మృతి పట్ల సంతాపం తెలిపిన వినోద్ కుమార్