మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిర్భయంగా టీకా వేయించుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, దవాఖాన పర్యవేక్షకుడు వెంకట రాములు, ఉప వైద్యాధికారి అంబరీష్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.