నమస్తే తెలంగాణ, న్యూస్నెట్వర్క్, మే 17: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేం ద్రాలకు తీసుకొస్తే.. 47 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం కొనడం లేదని అన్నదాతలు మం డిపడుతున్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రాశులుగా పోసి అధికారులు ఎప్పుడు కాంటాలు వేసి కొంటారోనని రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సర్కా రు నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలకు ధా న్యం తడిసి మొలకెత్తుతున్నది. మరికొన్ని చోట్ల వరద నీటికి కొట్టుకుపోతున్నదని ఆగ్రహించిన అన్నదాతలు శుక్రవారం ఆందోళన లు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)లోని సబ్ మార్కెట్ యార్డు ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం మోత్కూర్భువనగిరి ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేపట్టారు. కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లో రైతులు ధర్నా చేశారు. గ్రామంలో సెం టర్ ఏర్పాటుచేసి 15 రోజులవుతున్నా కనీసం 50 మంది రైతుల ధాన్యాన్ని కొనలేదని మం డిపడ్డారు. తూకం వేసిన బస్తాలు 15 రోజులైనా తరలించకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అనుపురం రైతులు రోడ్డెక్కారు. వేములవాడ-కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్-సిద్దిపేట రో డ్డుపై రైతులు రాస్తారోకోకు దిగారు. ఎస్సీ కాలనీలోని సొసైటీ, పట్టణంలోని ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యా న్ని మిల్లులకు తరలించకపోవడంతో మిగతా కొనుగోళ్లు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మం డలంలో రైతులు ఆందోళనకు దిగారు.
నాకున్న రెండెకరాల్లో వరి సాగుచేసిన. ధాన్యాన్ని రంగంపేట పీఏసీఎస్ కేంద్రానికి తెచ్చి 20 రోజులు దాటింది. నిర్వాహకులు ధాన్యం తేమ శాతాన్ని చూడలేదు. తూకం వేయడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మళ్లీ ధాన్యం తడి సింది. ధాన్యం ఆరబెట్టడానికి రోజు కేం ద్రానికి వచ్చిపోవుడుకే సరిపోతున్నది. మళ్లోసారి నా పొలంలో వరి వేస్తే చెప్పుతో కొట్టుకుంటా. రేవంత్రెడ్డి ప్రభుత్వం కంటే కేసీఆర్ సర్కారు నయముండే.
-చాకలి సిద్ధ్దయ్య, రంగంపేట రైతు, చిలిపిచెడ్ మండలం, మెదక్ జిల్లా