ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో న్యాయం
కరీంనగర్ రూరల్, జూన్ 19: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పోయిన భూమిని దక్కించుకున్నాడు ఓ రైతు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన ఆవుల రమ, నాంపెల్లి దంపతులకు గ్రామ శివారులో ఎక రం భూమి ఉన్నది. ఈ భూమిని ధరణిపోర్టల్లో నమోదు చేస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన సాయిని మల్లయ్య పేరిట పొరపాటున రిజిస్ట్రేషన్ అయింది. ఈ విషయాన్ని నాంపెల్లి కుమారుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికితీసుకెళ్లాడు. స్పందించిన మంత్రి వెంటనే విచారణకు ఆదేశించారు. అధికారులు మోకాపై వెళ్లారు. ఇరువురిని పిలిచి వివరాలు సేకరించారు. తనకు 529 సర్వేనంబర్లో భూమిలేదని సాయిని మల్లయ్య చెప్పా డు. పొరపాటుగా రిజిస్ట్రేషన్ అయిన భూమిని వారికి ఇచ్చేందుకు అంగీకరించి, శనివారం రమ, నాంపెల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ సందర్భంగా అధికారులు సదరు రైతు సాయిని మల్లయ్యను సత్కరించారు.