ఖైరతాబాద్, డిసెంబర్ 26: దక్షిణ భారత పసుపు రైతులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమావేశంలో వివిధ రాష్ర్టాల రైతు నేతలు పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పండించే పసుపులో 20 శాతానికి పైగా తెలంగాణలో పండిస్తున్నారని, 10 లక్షల క్వింటాళ్ల ట్రేడింగ్ జరుగుతున్నదని తెలంగాణ పసుపు రైతుల సం ఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు తెలిపారు. రాష్ర్టానికి జాతీయ పసుపుబోర్డు ప్రకటించినా నేటివరకు విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు.
దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుంటే ఫిబ్రవరిలో ఢిల్లీలో నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ నేత శివకుమార్ మాట్లాడుతూ కనీస మద్దతు ధర ల గ్యారెంటీ చట్టాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాజ్య రైతు సంఘం నేత శాంతకుమార్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాం టి వారని మరిచిపోవద్దని స్పష్టం చేశారు. పంజాబ్ బీకేయూ అధ్యక్షుడు జగజీత్సింగ్ మాట్లాడుతూ.. దేశమంతా రైతు రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.