చేగుంట, మార్చి 10 : రాత్రి కరెంట్కు మరో రైతు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన రైతు బోయిని గణేశ్ (42)కు మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్ పరిధిలో రెండెకరాలు ఉంది. అందులో వరి, మక్క పంట వేశాడు. పంట చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతుండడంతో.. ఆదివారం తెల్లవారుజామున పారకం పెట్టేందుకు చేనుకు వెళ్లాడు. బోరు నడవకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద వైరును సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గణేశ్కు భార్య కమల, కుమారులు కార్తీక్, అనిల్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్ఐ బాల్రాజు తెలిపారు.