నిజాంపేట,మార్చి17 : వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్తో(Electric shock )రైతు మృతి(Farmer dies) చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా నిజాంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బక్కొల్ల మల్లయ్య(44) రోజు మాదిరిగానే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. గత రాత్రి బలమైన ఈదురు గాలులు వీచగా పొలం వద్ద ఉన్న హైటెన్షన్ వైరు తెగి పంట పొలం చుట్టూ ఉన్న ఇనుప తీగపై పడింది.
ఇది గమనించని మల్లయ్య విద్యుత్ ప్రవహిస్తున్న తీగకు తగలడంతో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మల్లయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.