హైదరాబాద్ : రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ పాలసీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇవాళ దేశంలోనే అత్యధిక స్థాయిలో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే వారు.. తెలంగాణ ఉద్యోగులే అని సగర్వంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. హోంగార్డులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతో పాటు తదితర సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా 30 శాతం వేతన పెంపును అందుకున్నారు.