హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తూ.. పాస్పోర్టులు పొందిన కేసులో ప్రధాన నిందితులను సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్టు ఈవోడబ్ల్యూ ఎస్పీ వెంకటలక్ష్మి తెలిపారు. ఇప్పటికే చెన్నైకి చెందిన పాస్పోర్టు ఏజెంట్ను విచారించినట్టు పేర్కొన్నారు. పోలీసు కస్టడీకి అనుమతి లభించిన వెంటనే అందరినీ వేర్వేరుగా విచారించి, మరిన్ని వివరాలు రాబడతామని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన చెన్నై ఏజెంట్ను పోలీసులు విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా నకిలీ పత్రాలతో పాస్పోర్టులను సంపాదించడమే కాకుండా విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్పోర్టులు, వీసాలు ఇప్పించినట్టు సీఐడీ పోలీసులు గుర్తించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాలు ఇచ్చి ఆకట్టుకోవడం ఈ కేసులో ప్రధాన అంశం. భారతీయులు కాని వారికి సైతం ఇకడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెకించారని విచారణలో వెల్లడైంది. పోలీసు విచారణ అనంతరం మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 108 పాస్పోర్ట్ల వివరాలు రాబడుతున్నారు. 15 మొబైల్ ఫోన్లు, 5 ల్యాప్ టాప్లు, 4 సీపీయూలు, 3 ప్రింటర్లు, 11 పెన్డ్రైవ్ల స్టోరేజ్ని రిట్రైవ్ చేస్తున్నారు.