ఆదిలాబాద్, మే 24 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలో(Adilabad) నకిలీ పత్తి విత్తనాల9Fake cotton seeds) తయారీ కేంద్రం గుట్టురట్టయింది. శుక్రవారం మధ్యాహ్నం రాంనగర్ ప్రాంతంలో గోదాంలో నకిలీ విత్తనాలు తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన 945 పత్తి విత్తనాల ప్యాకెట్లతో పాటు 50 కిలోల విడి పత్తి విత్తనాలు, 330 బ్యాగులు జొన్న విత్తనాలు, నకిలీ విత్తనాల తయారీకి ఉపయోగించే కలర్, కెమికల్ను పట్టుకున్నారు. వీటి విలువ రూ.19,39,908 ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. విత్తన కేంద్రం నిర్వాహకుడు సామ అశోక్ రెడ్డితో పాటు అందులో పనిచేసే మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.