నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తుందని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాలోని గొల్లపేట, ఖురాన్ పేట్, బంగల్ పేట్లో రెండవ విడుత కంటి వెలుగును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వంతో ఏ ఒక్కరూ బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళదాలు ఉచితంగా అందిస్తారని వివరించారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేయిస్తుందని వెల్లడించారు.స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు , సంబంధిత శాఖల ఏఎన్ఎం, ఆశవర్కర్స్,అంగన్వాడీ టీచర్స్, సెక్రటరీలు తమ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.