హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో పది రోజులపాటు నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో మొత్తం 1240 మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న వైద్యులు, సిబందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం అభినందించారు. హైదరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలో 19 మంది వైద్య బృందం జనవరి 23వ తేదీ నుంచి శిబిరం నిర్వహించారు. మొత్తం 1240 మంది అధికారులు, ఉద్యోగులకు కంటి పరీక్షలు నిర్వహించినట్టు డాక్టర్ పద్మజ తెలిపారు. వీరిలో 550 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించామని, 404 మందికి కండ్లద్దాల కోసం రెఫర్ చేశామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్లు దీప్తి ప్రియాంక, మనోజ్రెడ్డి, మాధురి, సందీప్, దాసీ రెడ్డి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన నవీన్ మిట్టల్ గురువారం సీఎస్ శాంతికుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలపై చర్చించారు.