Telangana | హైదరాబాద్ : జీవో 58, 59( GO 58, 59 ) కింద స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) నిర్ణయం తీసుకుంది. స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. క్రమబద్దీకరణ వర్తించే కటాఫ్ తేదీని కూడా ప్రభుత్వం పొడిగించింది. క్రమబద్దీకరణ వర్తించే కటాఫ్ తేదీని 2014, జూన్ 2 నుంచి 2020 జూన్ 2 వరకు పొడిగించింది. ఇటీవల మంత్రివర్గ( Telangana Cabinet ) సమావేశ నిర్ణయానికి అనుగుణంగా మార్పులు చేశారు.
జీవో 76( GO 76 ) కింద సింగరేణి స్థలాల( Singareni Lands ) క్రమబద్దీకరణకు కూడా గడువు పెంచారు. దరఖాస్తుల గడువును మరో 3 నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. క్రమబద్దీకరణ వర్తించే కటాఫ్ తేదీని 2014, జూన్ 2 నుంచి 2020, జూన్ 2 గా మార్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని సింగరేణి స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను, ఇతర యూనిట్లను క్రమబద్దీకరించనున్నారు.