సిరిసిల్ల నియోజకవర్గంలోని నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరునెలల పాటు వీటి పదవీ కాలాన్ని పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిరిసిల్ల, పోతల్, రాచర్ల బొప్పపూర్, గంభీర్రావు పేట వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.