మిమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరనుకుంటున్నరా? దేశంలో రాష్ర్టాలు భాగం కాదా? రాష్ర్టాలను హద్దుల్లో పెడుతున్న కేంద్రం ఇష్టానుసార చర్యలను రాష్ర్టాలు ఎందుకు నిలదీయకూడదు? రాష్ర్టాలకు మిమ్మల్ని ప్రశ్నించే హకు ఎందుకు ఉండదు? మీ అసంబద్ధ చర్యల వల్ల దేశం ఆగమైతే రాష్ర్టాలు ఆగమైనట్టు కాదా? దేశంలోని రాష్ర్టాలన్నీ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండాలా? కూర్చున్న కొమ్మనే నరుకొనేలా కేంద్రం అనుసరిస్తున్న క్షమించరాని నేరాలను చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదు.
తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉన్నది. ఏమైతదో ఏమో అనే అనుమానం అకర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పోరాటం చేస్తున్నప్పుడు ఎందాక పోవాల్నో అందాక పోవాల్సిందే.
తెలంగాణకు అందుతున్న మొత్తం నిధుల్లో సెంట్రల్ డెవల్యూషన్ పద్దు ద్వారా అందుతున్నవి తీసివేస్తే వచ్చినవి కేవలం రూ.78 వేల కోట్లే. అంటే 8 ఏండ్ల నుంచి సగటున కేంద్రం నుంచి తెలంగాణకు అందిన నిధులు ఏటా కేవలం రూ. 9 వేలకోట్ల పైచిలుకు మాత్రమే. అంటే కేంద్రం తెలంగాణకు అందిస్తున్న ప్రోత్సాహం ఏ పాటిదో గణాంకాలతో సహా పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలి. తెలంగాణ ప్రగతిని కేంద్రం పీక పిసికి చంపివేస్తున్నదని, దేశ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది.
తాగునీరు అందిచటం చేతగాదు. విద్యుత్తు అందించటం చేతగాదు. కనీస మౌలిక వసతుల కల్పన ఊసే లేదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకూ, విద్యుత్తుకు కరువు ఉండటం సిగ్గుచేటు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటుచేసిన ఘనత బీజేపీదే. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రోత్సాహకాలందిస్తూ, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న నరేంద్రమోదీ అత్యంత అనర్హుడైన ప్రధానిగా నిలిచిపోతారు.
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో మాత్రం మిగతావి అందుకోలేని దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణను ఆర్థికంగా అణచివేయాలని కేంద్రంలోని బేజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రగతిశీల తెలంగాణను చూసి ప్రధాని మోదీకి కన్నుకుట్టిందని, అందుకే నిబంధనల ముసుగులో ఆర్థికంగా తెలంగాణను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాదికి రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్రం ప్రకటించాక, తర్వాత మాట మార్చి కుదించడం కుట్ర కాదా? అని సీఎం ప్రశ్నించారు. ఇటువంటి దివాలాకోరు, తెలివితకువ నిర్ణయాలపై ఉభయసభల్లో బీజేపీని నిలదీసి వారి నగ్న స్వరూపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో బట్టబయలుచేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. అందుకోసం అన్నిరకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే తాను కూడా ఢిల్లీకి వచ్చి విపక్షాలతో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక బిల్లులను నిర్ద్వంద్వంగా తిరసరించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావుకు సూచించారు. సోమవారంనుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. బీజేపీని ఎండగడుతూ సాగే టీఆర్ఎస్ పోరాటంలో కలిసొచ్చే అన్ని పక్షాలను సరైన దిశగా ఫ్లోర్ కో-ఆర్డినేషన్ చేసుకుంటూ నిరసనలను చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ఎంపీలను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. 8 ఏండ్లలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హకులను తొకిపెడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టే కార్యాచరణపై చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారతపౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని, అందుకు పార్లమెంటును సరైన వేదికగా మలుచుకోవాలని సూచించారు.
ప్రతిఏటా ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ర్టాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి బడ్జెట్లను రూపొందించుకొంటాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఈ ఏడాది తెలంగాణ ఎఫ్ఆర్బీఎం పరిమితి రూ.53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్రం తర్వాత మాట మార్చి రూ.23,000 కోట్లకు కుదించడం కుట్ర కాదా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా ఇటువంటి దివాలాకోరు, తెలివితకువ నిర్ణయాలపై ఉభయసభల్లో బీజేపీని నిలదీసి వారి నగ్నస్వరూపాన్ని బట్టబయలుచేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. విద్యుత్తు సంసరణల పేరుతో కేంద్రం తమకు అనుకూలంగా ఉండేవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ర్టాల మీద ఒత్తిడి తేవడంపైనా ప్రశ్నించాలని సూచించారు.
ఆర్థ్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలకు పాల్పడుతున్నదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల రుణాలు తెలంగాణ కంటే ఎకువగా ఉన్నాయని, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. ఎనిమిదేండ్ల కాలంలో ఒకరోజు కూ డా, ఒకపైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని తెలిపారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలం ప్రక్రియలో పాల్గొనే పెట్టుబడిదారులు తెలంగాణ బిడ్లవైపే ఎకువ మొగ్గుచూపుతున్న విషయం వాస్తవం కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచీ ప్రతి విషయంలోనూ నీతిఆయోగ్ ప్రశంసిస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అత్యుత్తమ ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాలను ప్రోత్సహించాలని పలుమార్లు నీతిఆయోగ్ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా కేంద్రం బుట్టదాఖలు చేసిందని, దీనిపై కూడా నిలదీయాలని సూచించారు.
‘మిమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకొంటున్నరా? దేశంలో రాష్ర్టాలు భాగస్వామ్యం కాదా? రాష్ర్టాలను హద్దుల్లో పెడుతున్న కేంద్రం ఇష్టానుసార చర్యలను ఎందుకు నిలదీయకూడదు? రాష్ర్టాలకు మిమ్మల్ని ప్రశ్నించే హకు ఎందుకు ఉండదు? మీ అసంబద్ధ చర్యల వల్ల దేశం ఆగమైతే రాష్ర్టాలు ఆగమైనట్టు కాదా? దేశంలోని రాష్ర్టాలన్నీ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండాలా? కూర్చున్న కొమ్మనే నరుకొనేలా కేంద్రం అనుసరిస్తున్న క్షమించరాని నేరాలను చూస్తూ ఊరుకొనే ప్రసక్తేలేదు’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే విషయంపై పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అంటూనే, విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెట్టాలనే వంకరటింకర నిబంధనలను ఏ విద్యుత్తు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమో దేశానికంతా తెలుసనే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని చెప్పారు. ‘నువ్వు అది చేస్తేనే, నేను ఇదిస్తా.. అంటే ఇదేమన్నా బేరమా? విధిగా ఎకువ ధర చెల్లించి బొగ్గును కొనాలని రాష్ర్టాలను ఒత్తిడి చేయడం హాస్యాస్పదం. పిడికెడు మంది నీ వ్యాపారులకు సాయం చేయడానికి దేశానికి నష్టం చేస్తవా? అని కేంద్రాన్ని నిలదీయాలె. ఈ దుర్మార్గ చర్యల తంతు ఉభయసభల్లో రికార్డు కావాలె’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన 67 ఏండ్లలో దేశం అప్పు రూ.56 లక్షల కోట్లు ఉంటే, 8 ఏండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దకుతుందని సీఎం దుయ్యబట్టారు. ఈ 8 ఏండ్ల కాలంలో కేంద్రం చేసిన ఒక మంచి పని ఏమిటో చెప్పాలని నిలదీశారు. రూపాయి పతనం, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్థికమాంద్యం, పాతాళానికి పడిపోయిన జీడీపీ తప్పితే, మోదీ పాలనలో కనిపించే ప్రగతి శూన్యమని విశ్లేషించారు. ‘తాగునీరు అందిచటం చేతగాదు. విద్యుత్తు అందించటం చేతగాదు. మౌలిక వసతుల కల్పన ఊసేలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకూ, విద్యుత్తుకు కరువు ఉండటం సిగ్గుచేటు. నాటి నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ వరకూ ఈ దేశ ప్రధానులుగా పనిచేసినవారు ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారే తప్ప, అమ్మకానికి పెట్టలేదు’అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటుచేసిన ఘనత బీజేపీకే దకిందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారుచౌకగా తెగనమ్ముతుండటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రోత్సాహకాలందిస్తూ, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న నరేంద్రమోదీ అత్యంత అనర్హుడైన ప్రధానిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ర్టాలను, దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్నిరకాలుగా భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ దిగజారుడు రాజకీయాలను వాస్తవ గణాంకాలతో సహా ప్రకటించి రాజకీయంగానే ఎదురోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఏ ప్రధాని చేయనన్ని తప్పులను మోదీ చేస్తున్నారని సీఎం అన్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను తనకు అనుకూలంగా సడలించుకోవడం, తన ఏలుబడిలోని రాష్ర్టాలకన్నా గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను నష్టపరచడం, ఆయా రాష్ర్టాలకు హకుగా అందాల్సిన పన్నుల వాటాను సెస్సుల రూపంలో దొడ్డిదారిన దొంగిలించడం, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ శక్తుల పట్ల మౌనం వహించడం వంటి దుర్మార్గాలను ఎంపీలు ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సూచించారు.
తెలంగాణ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనకుండా కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ వ్యవహారంపై ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించారు. వడ్లు పండించాలని ఒకసారి, వద్దని మరోసారి, కొంటామని ఒకసారి, కొనడంలేదని మరోసారి, అటు ఢిల్లీ బీజేపీ, ఇటు గల్లీ బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబించడం దుర్మార్గమని సీఎం అన్నారు. మరోవైపు అంతర్జాతీయ మారెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతున్నదని, వరి ఎకువ పండించాలని 4 రోజులనుంచి మళ్లీ బీజేపీ ప్రభుత్వం ప్రచారంచేస్తూ, అయోమయానికి గురి చేస్తున్నదని మండిపడ్డారు. రైతులను మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు, అయోమయానికి గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ గోల్మాల్, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి నేటిదాకా తెలంగాణ అత్యం త పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని(నరేగా) అమలుచేస్తున్నదని ప్రశంసిస్తూ వస్తున్న కేంద్రం నేడు మాట మార్చి కుట్రపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశా రు. తనిఖీల పేరుతో ఎన్నడూ లేనివిధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం ఒకేసారి 16 బృందాలను పంపి కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేంద్రం పశ్చిమబెంగాల్లో నరేగా పథకాన్ని రాజకీయ దు రుద్దేశంతో రద్దు చేసిందని, తెలంగాణలో కూడా ఇలాగే నరేగా ను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రం ఇటీవల బడ్జెట్లో అన్ని రంగాలకు కోతలు విధించిందని, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కట్టలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రగతిబాటలో నడవాల్సిన యువత మెదళ్లను కలుషితం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. డాలర్ విలువ రూ.100కు చేరే పరిస్థితి దాపురించిందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా.. మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రముఖ విదేశీ కంపెనీలు దేశాన్ని వీడి ఎందుకు వెళుతున్నాయో ప్రధాని జవాబివ్వాలని డిమాండ్చేశారు. మేకిన్ ఇండియా పేరుతో ప్రగల్భాలు పలికిన బీజేపీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఎద్దేవాచేశారు. పతంగులకు వాడే చిన్న మాంజా దగ్గర నుంచి ప్రతీ వస్తువు చైనా తదితర దేశాల నుంచే దిగుమతి చేసుకోవడం చూస్తుంటే బీజేపీ మేకిన్ ఇండియా డొల్లతనం బయటపడుతున్నదని చురకలంటించారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, పాలనలో విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా ఎలుగెత్తి చాటాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వారు కేవలం 30శాతం పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సంగతి మరువొద్దని, మిగిలిన 70 శాతం మంది ప్రజానీకం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేయాలని సూచించారు. ప్రజా వ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటులో మూకుమ్మడిగా రాజీనామాచేసిన సందర్భాలను సీఎం ఎంపీలకు గుర్తుచేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదురోకతప్పదని హెచ్చరించారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు డిమాండ్లతోపాటు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ఆదేశించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, బండి పార్థసారథిరెడ్డి, లోక్సభ సభ్యులు పోతుగంటి రాములు, జీ రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి అనిల్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావు, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సెక్రటరీ భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఎఫ్ఆర్బీఎం నిబంధనలు కేంద్రానికి ఒకలా, రాష్ర్టాలకు మరోలా ఉండటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీఎం అన్నారు. రాష్ట్రాల జీఎస్డీపీలో ఎఫ్ఆర్బీఎం పరిధిని 3%గా పరిమితి విధించి, కేంద్రం మాత్రం 6.4%గా నిబంధనలు సడలించడం ఎకడి న్యాయమని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టం వచ్చిన 19 ఏండ్లలో ఒక ఏడాది తప్పితే మిగిలిన 18 ఏండ్లలో ఏనాడూ కేంద్రంలోని ప్రభుత్వాలు నిబంధనలు పాటించలేదనే సంగతిని పార్లమెంటు దృష్టికి తేవాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రారంభమైన కాలం నుంచి ఏటా ఎఫ్ఆర్బీఎం పరిమితులను తనకు తానే సడలించుకుంటూ ఇష్టారాజ్యంగా అప్పులుతెస్తూ, దేశాన్ని దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం సవరణల పేరుతో కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశాన్ని దివాలా తీసేదిశగా.. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు.
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు దాపురించాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు సమాఖ్యస్ఫూర్తికి, లౌకికవాదానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయని చెప్పారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బీజేపీ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంట్ వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గళం విప్పాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొనే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ముందే ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టంచేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశానికి, రాష్ర్టాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని సైతం ఉద్దేశపూర్వకంగా లీక్చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం కుట్రపూరిత చర్య అని సీఎం స్పష్టంచేశారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరుగుతున్నదని, బీజేపీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శమని దుయ్యబట్టారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురదృష్టకరమని మండిపడ్డారు.
దేశంలో ఏ మూలన అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందని, దేశంలో దేశ జీడీపీకి ఎకువ శాతం వాటా ఇస్తున్న 8 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని సీఎం వివరించారు. ఆదాయం పన్ను సహా, వ్యాపార, వాణిజ్య, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో తెలంగాణ నుంచి 8 ఏండ్లలో కేంద్రానికి రూ.3,65,737 కోట్లు అందితే, కేంద్రం నుంచి తెలంగాణకు కేవలం రూ.1,96,449 కోట్లు వాటాగా వస్తున్నాయని, ఇదే విషయంపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు వివరించారు. అన్ని రాష్ర్టాలకు వచ్చినట్టుగానే రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల్లో సెంట్రల్ డెవల్యూషన్ పద్దు కింద వచ్చినవి రూ.1,17,797 కోట్లు అని, ఇవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చేవి కావని చెప్పారు. తెలంగాణకు అందుతున్న మొత్తం నిధుల్లో సెంట్రల్ డెవల్యూషన్ పద్దు ద్వారా అందుతున్నవి తీసివేస్తే వచ్చినవి రూ.78 వేల కోట్లు మాత్రమేనన్నారు. 8 ఏండ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు అందిన నిధులు ఏటా రూ.9 వేల కోట్ల పైచిలుకు మాత్రమేనని తెలిపారు. కేంద్రం తెలంగాణకు అందిస్తున్న ప్రోత్సాహం ఏ పాటిదో గణాంకాలతో సహా వివరిస్తూ, పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిగ్గదీయాలని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రగతిని కేంద్రం పీక పిసికి చంపివేస్తున్నదని, దీనిద్వారా దేశ ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరమున్నదని సీఎం చెప్పారు.
2014 నుంచి 2017 వరకు ఈ పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన రైతులకు కల్లాలు, సీసీ రోడ్లు, చెరువుల పనులు, అటవీ ప్రాంతాల్లో కంచెల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ పనులపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. వీటికి కేంద్రం ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలి.
2014 నుంచి 2017 వరకు ఈ పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన రైతులకు కల్లాలు, సీసీ రోడ్లు, చెరువుల పనులు, అటవీ ప్రాంతాల్లో కంచెల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ పనులపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. వీటికి కేంద్రం ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలి. ఒప్పందం ప్రకారం సీఎంఆర్ సేకరించాల్సిందిగా ఎఫ్సీఐని కేంద్రం ఆదేశించాలి. సీఎంఆర్ బియ్యం అందజేసే గడువు పెంచాలి.
ఎఫ్ఆర్బీఎం పెంపు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్, సీఎస్ఎస్ నిధులు, పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం ఇవ్వాలి.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం తెలంగాణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ.817.61 కోట్లు ఇవ్వాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రూ.1,350 కోట్లు ఇవ్వాలి. న్యూట్రిషన్ గ్రాంటు రూ.171 కోట్లు. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ 3,024 కోట్లు. మిషన్ భగీరథ గ్రాంట్ రూ.2,350 కోట్లు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథ గ్రాంట్ రూ.19,205 కోట్లు. మిషన్ కాకతీయ గ్రాంట్ రూ.5,000 కోట్లు. సీఎస్ఎస్ నిధులు రూ.495.20 కోట్లు. గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 682.50 కోట్లు. వీటికోసం పార్లమెంటులో కొట్లాడాలి.
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ స్థాపించాలి. బయ్యారంలో ఉకు పరిశ్రమ స్థాపించాలి. ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తు ఇవ్వాలి. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. కేంద్ర పథకాల్లో రాష్ర్టానికి రావాల్సిన వాటా ఇవ్వాలి. కామన్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ టాక్స్ నిధుల రీయింబర్స్మెంట్ 9, 10వ షెడ్యూళ్ల ప్రకారం సంస్థల విభజన పూర్తి చేయాలి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం రోడ్లు నిర్మించాలి.
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పందించి కృష్ణా నదీ జలాల సమస్యను ట్రిబ్యునల్కు నివేదించాలి.
కోల్ ఇండియా నుంచి 10 శాతం బొగ్గు కొనుగోలును తప్పనిసరి చేయరాదు. తెలంగాణలోని వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించవద్దు. విద్యుత్తు పంపిణీ, సరఫరా సంస్థల ప్రైవేటీకరణ చేపట్టవద్దు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ, ఫె్లై ఓవర్లు, సైఓవర్ల నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతివ్వాలి. రాత్రివేళ రోడ్లు మూసివేయరాదు.
ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను కేంద్రం వెంటనే పునరుద్ధరించాలి.
హైదరాబాద్లో నిరుపయోగంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూములు. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) – 324.87 ఎకరాలు. హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్ (హెచ్ఎఫ్ఎల్)- 126.32 ఎకరాలు. ఇండియన్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)- 551.03 ఎకరాలు. హెచ్ఎంటీ వాచెస్ (హెచ్ఎంటీ)- 888.05 ఎకరాలు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)- 2,272.85 ఎకరాలు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ – 3,020 ఎకరాలు . మొత్తం -7,183.12 ఎకరాలు