కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో (Bhadrachalam) ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. దుండగులు ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా ఝార్ఖండ్కు కారులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం శివారు ప్రాంతంలో కారును ఆపేందుకు ఎక్సయిజ్ శాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే కారును ఆపకుండా వెళ్లిపోయారు.
దీంతో కారును వెంబడించగా దుండగులు రామాలయం ప్రాంతంలో దానిని వదిలేసి పరారయ్యారు. కారును తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. పట్టుబడిన గంజాయి మొత్తం 150 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. కారును సీజ్ చేశామన్నారు.