గిర్మాజీపేట, మార్చి 5: గంజాయి విక్రయిస్తున్న ఎక్సైజ్ శాఖ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహమ్మద్ జబ్బార్ అలీకి దుబారా ఖర్చులతో వచ్చే జీతం సరిపోవడం లేదు. దీంతో తాను పనిచేస్తున్న ఠాణాలో సీజ్ చేసి నిల్వ ఉంచిన గంజాయిని దొంగిలించాడు.
వరంగల్ బస్టాండ్ పరిసరాల్లో విక్రయించే యత్నంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు సిబ్బంది పట్టుబడ్డాడు. గంజాయి విక్రయించడానికి వచ్చినట్టు అంగీకరించాడు. నిందితుడితోపాటు 1.090 కిలోల ఎండు గంజాయిని, బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పవన్కుమార్ తెలిపారు.