బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ సాక్షి పళనిస్వామి
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): అధిక నీటిపారుదల అనేది లవణీయత పెరుగుదలకు దారి తీస్తుందని తెలంగాణ తరఫు సాక్షి, వ్యవసాయరంగ నిపుణుడు పళనిస్వామి పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులవారీగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కృష్ణాజలాల కేటాయింపునకు సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఢిల్లీలో బుధవారం కొనసాగింది. తొలుత ఇప్పటివరకు నమోదు చేసిన రికార్డు పత్రాలను అందజేయాలని ఏపీ కోరగా, ట్రిబ్యునల్ నిరాకరించింది.
పళనిస్వామి దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలపై ఏపీ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పంట నీటి అవసరాలను రూపొందించడానికి తాను తాజా శాస్త్రీయ విధానాన్ని వర్తింపజేశానని, అంతేతప్ప నీటి కేటాయింపులు, ప్రవాహాలతో సంబంధంలేదని పళనిస్వామి స్పష్టంచేశారు. వర్షాధార వ్యవసాయం, సెరికల్చర్ను కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తెలంగాణ చేపట్టాలని ఏపీ సూచించగా, పళనిస్వామి ఆ వాదనను తిరసరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూరీ కృష్ణా డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలపై లవణీయత ప్రభావంపై అధ్యయనం చేసిందని తెలిపారు.