Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు.
దుర్మార్గమైన కాంగ్రెస్, బీజేపీ అబద్దాల ప్రచారం, నిరుద్యోగ నోటిఫికేషన్తో ఓటమి.. తెలంగాణ అభివృద్ధి పక్కకు నెట్టి బీజేపీపై అబద్ధాల ప్రచారం చేశారు. దక్షిణ రాష్ట్రాల్లో ఏ ఒక్క పార్టీ మూడోసారి అధికారంలోకి రాలేదన్నారు. కానీ, బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్న ఓటమి జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్పై విరుచుకుపడుతున్నారన్నారు. విజన చట్టాన్ని తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.
మోదీ 9ఏళ్ల పాలనలో ఆంధ్రా, తెలంగాణ నీటి వాటాలను పంపిణీ చేయలేదన్నారు. కానీ, బీజేపీ విమర్శించకుండా బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారన్నారు. ఆంధ్ర మీడియా సంస్థలు తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న వాటిని ఎప్పుడయినా చూపించాయా..? అంటూ ప్రశ్నించారు. అన్నీ అమ్ముడుపోయిన సంస్థలేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పంటల సాగు తగ్గిందని.. నీటిని కోసం, కరెంట్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయన్నారు. చేజారిన ఏడు అసెంబ్లీ స్థానాలు కాపాడుకోవాలంటే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలన్నారు. ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.