Jagadish Reddy | పంట పొలాలు ఎండిపోతున్న చూసి పట్టించుకోని అసమర్థత ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని రామన్నగూడెం రామోజీ తండాలో ఎండిపోతున్న పంట పొలాలను, మిరప తోటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో బోరుబావులను పూర్తిచేసిన రైతులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ బావులు తవ్వుతూ నూతనంగా బోర్లు వేయిస్తున్నారన్నారు. ఎండిపోయిన వరి పొలాలకు ఎకరాకు రూ.50వేల నష్ట పరహారం, మిరప తోటలకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు తప్పా.. తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే సమయానికి చెరువులు కుంటలు జలకళతో కళకళలాడాయని.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వెలవెలబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసవిలో చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. తెలంగాణలో పంట పొలాలు ఎండిపోతున్న నిమ్మ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. అనంతరం రామన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.