Harish Rao | హైదరాబాద్(బజార్ హత్నూర్) : మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది అని హరీశ్రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నామని మండిపడ్డారు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వేసవి వేళ మారుమూల ప్రజలకు శాపంగా మారిందని పేర్కొన్నారు.
భుజాలు కాయలు కాసేలా బిందెలు మోస్తూ, వాగులు, వ్యవసాయ బావుల నుండి నీళ్ళు తెచ్చుకునే దుస్థితిని కల్పించింది. పథకాలు అమలులో వైఫల్యం.. పరిపాలనలో వైఫల్యం.. చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీశ్రావు ధ్వజమెత్తారు.
అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది.
ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాం.
మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వేసవి వేళ మారుమూల ప్రజలకు శాపంగా మారింది.… pic.twitter.com/5ViKUmoG8S
— Harish Rao Thanneeru (@BRSHarish) March 7, 2025