Harish Rao | ఆ నాడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడ ఉన్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతునొక్కేలా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి ఏంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మాకు మైక్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు.
మేమం మాట్లాడితే మైక్లు కట్ చేసి సభను వాయిదా వేశారన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహరావుకు గుంటెడు భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని, ప్రజాస్వామ్యబద్దంగా ఉంటామని చెప్పి గొంతు నొక్కుతున్నారన్నారు. అమరవీరులను బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ అన్నీ స్వీపింగ్ కామెంట్ చేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల గురించి మాట్లాడి నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. రేవంత్కు ఉద్యమం గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆ నాడుఉద్యమకాలంలో రేవంత్ ఎక్కడనున్నరన్నారు.
కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నామన్నారు. వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండోస్థానంలో నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో 1.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒక ఏడాదిలో 24లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని.. వ్యవసాయ వృద్ధిరేటులో నేడు తెలంగాణ రెండోస్థానంలో ఉన్నదన్నారు. మిరపపంటలో తెలంగాణ నెంబర్ వన్ ఉందన్నారు. మేం సంపద పెంచినం.. పేదలకు పంచామన్నారు. సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. రైతుబీమా ఎందుకని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు.
కేసీఆర్ పాలనలో భూగర్భ జలాలు పెరిగాయని.. తెలంగాణలో ఆరున్నర మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని. బోర్ల కింద, ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరిగిందని తెలిపారు. చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకొని ఎండబెట్టారని.. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసిన చరిత్ర మాదన్నారు. పాలమూరు పచ్చబడేలా చేశామన్నారు. అప్పుడు బలిదేవత అన్న సోనియా ఇప్పుడు దేవత అయ్యింది అంటూ విమర్శించారు. రాజకీయం కోసం కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తుందని.. తెలంగాణ అమరుల చావుకు సోనియాగాంధీ కారణం కాదా?.. సోనియాగాంధీని బలిదేవత అన్నది రేవంత్ కాదా? అంటూ నిలదీశారు. సంపద పెంచి ప్రజలకు పంచిన ఘనత బీఆర్ఎస్దని.. అప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ మా గొంతు నొక్కుతుందని.. సభ జరిగిన తీరు చాలా దురదృష్టకరమంటూ మండిపడ్డారు.