కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు.
47వ డివిజన్లో భారీ ర్యాలీ తీశారు. డప్పుల చప్పుళ్లు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. హరిశంకర్ను కార్పొరేటర్గా గెలిపిస్తే మేయర్గా చేసి పంపిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.